విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మించిన మహి V రాఘవ్ పాఠశాల మూవీ తో దర్శకుడిగా మారారు. మహి V రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన ఆనందో బ్రహ్మ, యాత్ర వంటి మూవీస్ విజయం సాధించాయి. ఇప్పుడు పివిపి సినిమా వంటి పెద్ద బ్యానర్ లో సిండికేట్ మూవీ రూపొందించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పివిపి బ్యానర్ పై రూపొందిన బలుపు, క్షణం, ఊపిరి, ఘాజి, మహర్షి మూవీస్ ఘనవిజయం సాధించాయి. పివిపి బ్యానర్ పై వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఎవరు మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఎమోషనల్ పర్సన్, తాను అనుకున్నది సాధించగల మహి V రాఘవ్ దర్శకత్వంలో సిండికేట్ మూవీ రూపొందిస్తున్నామని, దైవ కృప, ప్రేక్షకుల విషెస్ తో ఒక పాన్ ఇండియా మూవీగా రుపొందాలని తమ సిండికేట్ ప్రార్ధిస్తుందని పివిపి సినిమా ట్వీట్ చేసింది.
[youtube_video videoid=zc3JoINdSA4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: