సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో ‘సాహో’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంకా నెలరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అప్పుడే మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి టీజర్ ను.. సయ్యా సైకో అనే పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో పాటను విడుదల చేశారు. తాజాగా ‘ఏ చోట నువ్వున్నా’ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ నాలుగు వర్షెన్స్ కు గురు రంధవా మ్యూజిక్ అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, మందిరా బేడీ ఇలా పులువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[youtube_video videoid=kTgFw8iqkJ8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: