సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్కి జోడీగా రష్మిక నటిస్తుండగా… ఓ శక్తిమంతమైన పాత్రలో విజయశాంతి దర్శనమివ్వనుంది. ఇదిలా ఉంటే… ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతోంది. స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన భారీ ట్రైన్ సెట్లో మహేష్, రష్మిక, రాజేంద్రప్రసాద్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. కాగా… ఈ షెడ్యూల్ ఆగస్టు 10 వరకు కొనసాగుతుందని తెలిసింది. అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీలో నెక్ట్స్ షెడ్యూల్ మొదలవుతుందని టాక్.
2020 సంక్రాంతికి `సరిలేరు నీకెవ్వరు` ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=024DhvRCnPo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: