వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో ‘ఎవరు’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆగష్ట్ 15వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్. దీంతో ఇంకా రెండు వారాలు మాత్రమే రిలీజ్ కు ఉండటంతో.. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను, టీజర్ ను రిలీజ్ చేయగా తాజాగా ఎన్నెన్నో లిరికల్ పాటను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో శేష్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, మురళి శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీవీపీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
కాగా వీటితో పాటు అడివి శేష్ చేతిలో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో గత ఏడాది తనకు మంచి సక్సెస్ ఇచ్చిన గూఢచారి సీక్వెల్ గూఢచారి 2 కాగా మరొకటి మహేష్ బాబు, సోనీ సంస్థల సంయుక్తంగా నిర్మించనున్న మేజర్.
[youtube_video videoid=oHNldqwhb4g]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: