కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిథి పాత్రల్లో కనిపించనుండగా… సీనియర్ యాక్ట్రస్ లక్ష్మి, ‘వెన్నెల’ కిషోర్, నాజర్, రావు రమేష్, ఝాన్సీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ ఛైతన్ భరద్వాజ్ సంగీతమందించిన ఈ చిత్రాన్ని మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `మన్మథుడు 2` ఫస్ట్ సింగిల్ “హే మెనినా” ని ఆదివారం విడుదల చేశారు. శుభమ్ విశ్వనాధ్ రచించిన ఈ గీతాన్ని ఛైతన్ భరద్వాజ్ ఆలపించారు. ట్రెడీషనల్ బీట్కి ట్రెండీగా ఉండే వెస్ట్రన్ స్టైల్ను మిక్స్ చేసిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. కాగా… ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను ఈ నెల 25న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. టీజర్లకు మించిన ఫన్ ట్రైలర్లో ఉంటుందని టాక్.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న `మన్మథుడు 2`… ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=rstFuW4ZDeU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: