ఇటీవల రజనీకాంత్ హీరోగీ పేట సినిమాను తెరకెక్కించిన కార్తిక్ సుబ్బరాజ్.. ఇప్పుడు అల్లుడితో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. అయితే ఈ సినిమా ఎప్పుడో తెరకెక్కాల్సింది కానీ.. సుబ్బరాజ్ మెర్క్యురి, పేట సినిమాలు చేయడంతో ధనుష్ ప్రాజెక్ట్ కాస్త లేటయింది. ఫైనల్లీ ఇప్పుడు ఈసినిమా తెరకెక్కనుంది. ఇటీవలే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తిచేసుకున్న ఈసినిమాను ఆగష్ట్ లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మలయాళంలో మాయనది, వరదన్ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న మలయాళీ భామ ఐశ్వర్య లక్ష్మీని ఈసినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. వైనాట్ స్టూడియో బ్యానరుపై నిర్మితమవుతున్న ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
[youtube_video videoid=TDkeOOOMmao]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: