జగన్ శక్తి దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్, తాప్సీ, నిత్యా మేనన్, సోనాక్షి సిన్హా, శర్మన్ జోషి, కీర్తి కుల్హరి ముఖ్య పాత్రల్లో మిషన్ మంగళ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగస్ట్ 15న రిలీజ్ చేయనున్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా..ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘పరిశోధనలు లేనిదే సైన్స్ లేదు. పరిశోధనలు చేయకుండా మనకి మనం శాస్త్రవేత్తలం అని చెప్పుకోలేం’ అంటూ సాగే ఈ ట్రైలర్ లో ఎన్ని సమస్యలను ఎదుర్కొని కేవలం ఆడవాళ్లతో మంగళ్యాన్ను మార్స్పైకి పంపిస్తారో చూపించారు. మరి ట్రైలర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో…
కాగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మార్స్ గ్రహం పైకి ప్రయోగించిన మంగళ్ యాన్ ఉపగ్రహం సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ సైంటిస్ట్ రాకేష్ ధావన్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించనున్నారు.
[youtube_video videoid=q10nfS9V090]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: