రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. ‘నీది నాది ఒకే కథ’తో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఊడుగుల… ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో… రానా విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నాడని టాక్. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్కి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం… ఇప్పటికే తెలంగాణలోని ధరిపల్లి గ్రామంలో తొలి షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. కాగా… వచ్చే వారం నుంచి హైదరాబాద్లో రెండో షెడ్యూల్ను ప్రారంభించనున్నారని సమాచారం. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
[youtube_video videoid=3o1NsYYX0GU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: