ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో మోస్ట్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. క్షణం, అమీ తుమీ, గూఢచారి సినిమాల హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న శేష్ ఇప్పుడు ఎవరు అనే మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను మాత్రం చాలా సీక్రెట్ గా పూర్తి చేశాడు. సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని.. అవి రివీల్ కాకూడదనే సీక్రెట్ గా షూటింగ్ చేశామని చెబుతున్నాడు శేష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రెండు రోజుల క్రితమే ఈ సినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా.. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కాగా వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో శేష్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నవీన్ చంద్ర, మురళి శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీవీపీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను ఆగష్టు 23న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు
కాగా వీటితో పాటు అడివి శేష్ చేతిలో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో గత ఏడాది తనకు మంచి సక్సెస్ ఇచ్చిన గూడచారి సీక్వెల్ కాగా తో మరొకటి మహేష్ బాబు, సోనీ సంస్థల సంయుక్తంగా నిర్మించనున్న మేజర్.
[youtube_video videoid=CQ_7dQbA-HY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: