అడివి సాయికిరణ్ డైరెక్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా ‘ఆపరేషన్ గోల్డ్ఫిష్’ అనే యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాతో పాటు కార్తీక్ విఘ్నేశ్ దర్శకత్వంలో ఆది హీరోగా మరో కొత్త సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. తెలుగు, తమిళ బై లింగ్వుల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో వేదిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇది తెలుగులో వేదిక నటిస్తున్న నాలుగో సినిమా. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ‘రోబో’, ‘2.0’ చిత్రాలకు అసోసియేట్ కెమెరామెన్గా పనిచేసిన గౌతమ్ జార్జ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సి.సత్య సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
మరి 2012లో వచ్చిన ‘లవ్లీ’ సినిమానే ఆదికి ఆఖరి హిట్. ఆ తరవాత వరసగా 8 సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టాయి. దీంతో ఈసారి ఎలాగైనా కమర్షియల్ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాలు ఆదికి ఎంత వరకూ కలిసొస్తాయో చూద్దాం.
[subscribe]
[youtube_video videoid= Di2RS42rXuU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: