`నా పేరు సూర్య` తరువాత స్వల్ప విరామం తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… ప్రస్తుతం ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన రెండో షెడ్యూల్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో తీర్చిదిద్దిన ఓ హౌస్ సెట్లో జరుగుతోంది. అక్కడ నాయికానాయికలతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా… కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. కాగా… సాధ్యమైనంత త్వరగా చిత్రాన్ని పూర్తి చేసి… డిసెంబర్లో విడుదల చేయనున్నారని ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చాయి. అయితే… లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాని 2020 జనవరి 11న గాని లేదా 13న గానీ సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విడుదల తేదీకి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశముంది.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.