`చిత్రలహరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత సాయి తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా `ప్రతి రోజు పండగే`. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. మూడు తరాలకు చెందిన వ్యక్తుల (తాత, తండ్రి, మనవడు) మధ్య ఉండే అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. తాత, తండ్రి పాత్రల్లో సత్యరాజ్, రావురమేష్ కనిపించనుండగా… మనవడి పాత్రలో సాయి తేజ్ దర్శనమివ్వనున్నాడు. కాగా… హైదరాబాద్లో రెండు రోజుల క్రితం (జూన్ 24న) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం… అతిత్వరలోనే రెగ్యులర్ షూటింగ్కి వెళ్లనుంది. అంతేకాదు, విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రం… కోనసీమలో తొలి షెడ్యూల్ను జరుపుకోనున్నట్టు సమాచారం. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని… జీఎ2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 2020 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారని ప్రచారం సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
[youtube_video videoid=QvSP5gJkKg0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: