స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాకు ‘నాన్న నేను’, ‘అలకనంద’ వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తీర్చిదిద్దిన ఓ హౌస్ సెట్లో నాయికానాయికలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ అనంతరం జూలై 5న చిత్ర యూనిట్ పొల్లాచ్చికి పయనమవనుందట. దాదాపు 20 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో కొన్ని కీలక ఘట్టాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. టబు, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ… 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
[youtube_video videoid=zOb1usWzAfw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: