‘మనం’… అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా… అక్కినేని కుటుంబానికి మరపురాని చిత్రంగా నిలచిపోయింది. బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ రూపొందించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అటు అక్కినేని అభిమానులకే కాదు… ఇటు సగటు ప్రేక్షకులకు కూడా నయనానందాన్ని కలిగించింది. కట్ చేస్తే… ఐదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత నాగార్జున, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో మరో సినిమా రానుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం నాని `గ్యాంగ్ లీడర్`తో బిజీగా ఉన్న విక్రమ్… ఆ సినిమా పూర్తయ్యాక తన తదుపరి చిత్రాన్ని నాగ్తో ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు, ఈ ఏడాది చివరలో పట్టాలెక్కే ఈ క్రేజీ ప్రాజెక్ట్ని… 2020 ద్వితీయార్ధంలో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. ప్రస్తుతం నాగ్ `మన్మథుడు 2`, `బంగార్రాజు`, `బ్రహ్మాస్త` (హిందీ)తో బిజీగా ఉన్నాడు. వీటిలో `మన్మథుడు 2` ఆగస్టులో రిలీజ్ కానుండగా… `బంగార్రాజు`, `బ్రహ్మాస్త` వచ్చే ఏడాది తెరపైకి రానున్నాయి.
మరి… `మనం` తరువాత మరోసారి జట్టుకడుతున్న నాగ్, విక్రమ్ కాంబినేషన్… ఈ సారి ఎలాంటి చిత్రంతో పలకరిస్తుందో చూడాలి.
[youtube_video videoid=LVsE_Ge_AGo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: