కింగ్ నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మన్మథుడు 2’. ‘మన్మథుడు’ స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుండగా… సమంత, కీర్తి సురేష్ అతిథి పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి సింహభాగం చిత్రీకరణ పూర్తయ్యింది. కాగా, ప్రస్తుతం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన ప్రత్యేక సెట్లో కుటుంబ సన్నివేశాలను రూపొందిస్తున్నట్టు సమాచారం. కీలక సందర్భంలో వచ్చే ఈ దృశ్యాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిసింది.
సీనియర్ నటి లక్ష్మి, ‘వెన్నెల’ కిషోర్, రావు రమేష్, ఝాన్సీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం… ఆగస్టు 9న థియేటర్లలో సందడి చేయనుంది.
[youtube_video videoid=84UusuAb1H8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: