ఇటీవల వెన్నెముకకు మేజర్ ఆపరేషన్ జరిగిన తరువాత కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకున్న ప్రముఖ నటులు, నిర్మాత, పార్లమెంటు మాజీ సభ్యులు మురళీమోహన్ తొలిసారిగా నిన్న జరిగిన ఒక డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ మణికొండ లో మర్రిచెట్టు జంక్షన్ వద్ద ” రూట్స్ డెంటల్ క్లినిక్స్” రెండవ బ్రాంచ్ ప్రారంభోత్సవంలో మురళీమోహన్ పాల్గొన్నారు. ఆయనతోపాటు ప్రముఖ రచయిత, నటులు పరుచూరి గోపాలకృష్ణ మరికొందరు సినీ టీవీ రంగాల నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ డెంటల్ సర్జన్ డాక్టర్ కురివిల్ల సంతోష్ గౌడ్, డాక్టర్ ప్రభు తేజ్, డాక్టర్ సురేష్ గౌడ్, డాక్టర్ సిద్ధార్థ్ లు నెలకొల్పిన ఈ”రూట్స్ డెంటల్ క్లినిక్స్” ప్రారంభోత్సవ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ “చెట్టు బలంగా ఉండాలంటే వేళ్ళు, ఇల్లు బలంగా ఉండాలంటే పునాదులు, ఒళ్ళు బలంగా ఉండాలంటే పళ్ళు దృఢంగా ఉండాలి. పళ్ళు దృఢంగా ఉండాలి అంటే అందుకు అవసరమైన ఇలాంటి డెంటల్ క్లినిక్ ల ఆవశ్యకత ఎంతైనా ఉంది . Dental treatment పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగిన డాక్టర్లు అత్యాధునిక సదుపాయాలతో ప్రారంభించిన రూట్స్ డెంటల్ క్లినిక్స్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను”- అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ” సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. ఇప్పుడు కళ్ళ తో పాటు పళ్ళు కూడా ప్రధానం అనుకునే అవగాహన ప్రజలలో ఏర్పడింది. జనంలో డెంటల్ ఎవేర్నెస్ ఎక్కువైన కారణంగానే డెంటల్ క్లినిక్ లు కూడా ఎక్కువగా వెలుస్తున్నాయి. దంత వైద్యం పట్ల , అందులో వచ్చిన అధునాతన వైద్య విధానాల పట్ల పూర్తి అవగాహన కలిగిన వైద్యులు డాక్టర్ కురివిల్ల సంతోష్ గౌడ్ గారు ఆయన సహచరులు ప్రారంభించిన ” రూట్స్ డెంటల్ క్లినిక్స్” విజయవంతం కావాలని, మరెన్నో శాఖలతో ఉభయ రాష్ట్రాలలో విస్తరించాలని కోరుకుంటూ అభినందిస్తున్నాను”- అన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మురళీమోహన్, పరుచూరి గోపాలకృష్ణ మరియు సినీ టీవీ రంగాలకు చెందిన నటీనటులకు డాక్టర్ కురివిల్ల సంతోష్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
[youtube_video videoid=46OLd0Ytdl0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: