ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలసి హాలిడే ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ట్రిప్ నుంచి రాగానే… అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీ కానున్నాడు. మిలటరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మహేష్ తొలిసారి ఆర్మీ మేజర్గా దర్శనమివ్వనున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 1 నుంచి జమ్మూ, కాశ్మీర్లో తొలి షెడ్యూల్ను జరుపుకోనుందని సమాచారం. ఈ షెడ్యూల్లో భాగంగా… మహేష్పై కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహేష్ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ యాక్ట్రస్ విజయశాంతి, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ‘ఎఫ్ 2’తో అనిల్ రావిపూడి, ‘మహర్షి’తో మహేశ్ ఘన విజయాలను అందుకున్న నేపథ్యంలో ‘సరిలేరు నీకెవ్వరు’ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
మరి ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ ఆ అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే.. 2020 సంక్రాంతి వరకు వేచి ఉండాల్సిందే.
[youtube_video videoid=shpVFz2yFSo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: