సూపర్ స్టార్ మహేష్ బాబు, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న జంటగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నాడు. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ… ఈ నెల (జూన్) 24 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాలోని మహేష్ పాత్ర తీరు తెన్నులకు సంబంధించి పలు కథనాలు టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అవేమిటంటే… ఆర్మీ మేజర్గా దర్శనమివ్వనున్న మహేష్కు చిన్నప్పుడు జరిగిన ఓ ఇన్సిడెంట్ వల్ల రక్తాన్ని చూస్తే చాలు భయం పుడుతుంటుందట. అంటే… హీరో క్యారెక్టర్కి హెమోఫోబియా ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలో… ఈ పాత్ర చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయని సమాచారం. అలాగే… తన సమస్యని కథానాయకుడు చివరాఖరికి ఎలా అధిగమించాడు? అనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని టాక్. అంతేకాదు, ఓ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్గా విజయశాంతి కనిపిస్తారనీ… ఆమెకు సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా మహేష్ అగుపిస్తాడని మరి కొన్ని కథనాల సారాంశం. మొత్తమ్మీద… ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేష్ సరికొత్త పాత్రలో కనిపిస్తాడన్నమాట. మరి మహేష్ పాత్రకు సంబంధించిన వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.
కాగా… హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’… 2020 సంక్రాంతికి విడుదల కానుంది.
[subscribe]
[youtube_video videoid=zCzNEtv7DzE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: