విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. పాయల్ రాజ్పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ను కె.ఎస్.రవీంద్ర (బాబీ) రూపొందిస్తున్నాడు. తమన్ బాణీలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వెంకీ రైస్ మిల్ ఓనర్గా… చైతు ఆర్మీ ఆఫీసర్గా దర్శనమివ్వనున్న ఈ సినిమా… ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో నిరవధికంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా… ఈ ఎంటర్టైనర్లో మాజీ మిస్టర్ ఇండియా వరల్డ్ (2014) ప్రతీక్ జైన్ ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం… కాస్త ముందుగానే వెంకీమామ
తెరపైకి రానున్నాడట. అన్నీ కుదిరితే… సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందట. త్వరలోనే విడుదల తేదిపై అధికారిక ప్రకటన రానుంది.
[subscribe]
[youtube_video videoid=bJAKvOx_UE4 ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: