తెలుగు ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు… తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి… తెలుగు తెరపై ధృవతారగా వెలిగిన నటుడు… తెలుగుదేశం పార్టీ స్థాపించి సుపరిపాలన అందించి, దేశరాజకీయాలపై తన ముద్ర వేసిన రాజకీయ నాయకుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ 97వ జయంతి నేడు. ఈ సందర్భంగా.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని ఆయనకు ఎన్టీఆర్ కుఘన నివాళులర్పించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే అక్కడికి వెళ్లిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. ప్రతి ఏడూ జయంతి సందర్భంగా ఘాట్ మొత్తం పూలతో అలంకరించే వారు. కానీ ఈసారి మాత్రం అసమాధి దగ్గర ఒక్క పువ్వు కూడా కనిపించకపోవడంతో పరిస్థితిని చూసి అసహనం వ్యక్తం చేశారు. దాంతో వెంటనే అనుచరులను పిలిపించి పువ్వులను తెప్పించి అభిమానుల సహాయంతో ఘాట్ చుట్టూ అందంగా పూలతో అలంకరించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సందర్భంగా జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం. ఇక నుంచి తాత వర్థంతి – జయంతి వేడుకలకు సంబందించిన ఏర్పాట్లను తామే చూసుకుంటామని చెప్పారట. మొత్తానికి పెద్ద ఎన్టీఆర్ జయంతిన.. చిన్న ఎన్టీఆర్ కు కోపం తెప్పించారు.
[subscribe]
[youtube_video videoid=NGFeA0FJ3lI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: