“హనీ ఈజ్ ద బెస్ట్” అంటూ ‘ఎఫ్ 2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది పంజాబీ జాబిలి మెహరీన్. ప్రస్తుతం… యాక్షన్ హీరో గోపీచంద్, తమిళ డైరెక్టర్ తిరు కాంబినేషన్లో రూపొందుతున్న ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో హీరోయిన్గా నటిస్తోంది ఈ స్టన్నింగ్ బ్యూటీ. అలాగే… నాగశౌర్య హీరోగా నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ కథానాయికగా నటిస్తోంది. ఇదిలా ఉంటే… మెహరీన్ ఓ బంపర్ ఆఫర్ను తన ఖాతాలో వేసుకున్నట్టు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… నటసింహ నందమూరి బాలకృష్ణ, కోలీవుడ్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో ‘రూలర్’ (ప్రచారంలో ఉన్న పేరు) అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం పోషిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో… ఇద్దరు నాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో… మెహరీన్ను ఓ నాయికగా ఎంపిక చేసారట. ఇక మరో హీరోయిన్ పాత్రలో జై సింహా
ఫేమ్ హరిప్రియ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఆ మధ్య ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ‘ఆర్ఎక్స్ 100’ భామ పాయల్ రాజ్పుత్ నటించనుందనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు మెహరీన్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుందని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో… మెహరీన్ ఎంట్రీకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.
కాగా.. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ చిత్రం… జూన్ నుంచి సెట్స్పైకి వెళ్ళనుంది. 2020 సంక్రాంతికి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లలో సందడి చేయనుంది.
[subscribe]
[youtube_video videoid=st6fjHfRFCM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: