మిర్చి
… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో వెరీ స్పెషల్ మూవీ. ఈ సినిమాతోనే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు. పూర్వాశ్రమంలో రచయిత అయిన కొరటాల… మిర్చి
తరువాత దర్శకరచయితగా ఇక వెనక్కు చూసుకునే పరిస్థితి రాలేదు. కట్ చేస్తే… ఇప్పుడు మరో రైటర్కి డైరెక్టర్గా ఛాన్స్ ఇవ్వబోతున్నాడట మన డార్లింగ్ హీరో ప్రభాస్. ఆ రచయిత మరెవరో కాదు… మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
, కంచె
, గౌతమీపుత్ర శాతకర్ణి
, మహానటి
చిత్రాలను తన సంభాషణలతో మరో స్థాయికి తీసుకెళ్ళిన సాయిమాధవ్ బుర్రా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫిల్మ్నగర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం… తాజాగా ప్రభాస్ని సంప్రదించిన సాయిమాధవ్ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ని చెప్పడమే కాకుండా ప్రభాస్ నుంచి ఆమోదముద్ర కూడా పొందాడని తెలుస్తోంది. అంతేకాదు.. సాహో
, జాన్
(ప్రచారంలో ఉన్న పేరు) తరువాత ప్రభాస్ చేయబోయే సినిమా ఇదే అవుతుందని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్పై క్లారిటీ వస్తుంది.మరి… ప్రభాస్ ప్రోత్సాహంతో కొరటాల శివ లాగే సాయిమాధవ్ కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా రాణిస్తాడేమో చూద్దాం.
[subscribe]
[youtube_video videoid=jP7HSdPuJdc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: