సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ ‘మహర్షి’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా… గడచిన 12 రోజుల్లో పలు చోట్ల రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. ఇక నైజాం ఏరియా విషయానికొస్తే.. ఇప్పటికే లాభాల బాట పట్టిన ‘మహర్షి’… అక్కడ అత్యధిక వసూళ్లు రాబట్టిన నాలుగో చిత్రంగా చరిత్ర సృష్టించింది. నైజాంలో రూ.25 కోట్ల షేర్ రాబట్టి… ఆ క్లబ్లో చేరిన నాలుగో చిత్రంగా నిలచింది మహర్షి
. మిక్స్డ్ టాక్తో ఈ స్థాయి వసూళ్ళు రావడం అంటే… మహేష్ బాబు స్టార్డమ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాగా… నైజాంలో మొదటి మూడు స్థానాలు బాహుబలి
సిరీస్, రంగస్థలం
కి దక్కాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… నైజాంలో ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ రూ.68 కోట్ల షేర్తో మొదటి స్థానంలో ఉండగా… రూ.42.70 కోట్ల షేర్తో ‘బాహుబలి’ రెండో స్థానంలో ఉంది. ఇక గత సంవత్సరం వేసవికి విడుదలైన ‘రంగస్థలం’ రూ.27.70 కోట్ల షేర్తో మూడో స్థానంలో ఉంది. ఇంతవరకు రూ.23.45 కోట్ల షేర్తో నాలుగో స్థానంలో ఉన్న ‘అత్తారింటికి దారేది’… ఇప్పుడు ‘మహర్షి’ రాకతో ఐదో స్థానానికి పరిమితమైంది.
ఇక ఆరు నుంచి పది స్థానాలలో ‘2.0’(రూ.23.35 కోట్ల షేర్), ‘ఎఫ్ 2’(రూ.22.80 కోట్లు), ‘మగధీర’(రూ.22.60 కోట్లు), ‘శ్రీమంతుడు’(రూ.22.30 కోట్లు), ‘అరవింద సమేత’(రూ.21.10 కోట్ల షేర్) ఉన్నాయి.
[subscribe]
[youtube_video videoid=GyLieYLhuiM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: