నిన్న మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి అగ్ర హీరో విక్టరీ వెంకటేష్, యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా రాగా పలువురు సెలబ్రిటీలు కూాడా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో మాట్లాడిన మహేష్ బాబు… తన కెరీర్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్లందరి గురించి ప్రస్తావించారు. అయితే తనను సూపర్ స్టార్ గా మార్చిన పోకిరి సినిమా డైరెక్టర్ పూరీ గురించి ప్రస్తావించడం మర్చిపోయారు. ఇక అంతే ఇదే పెద్ద చర్చకు దారితీసింది. అందరూ మహేష్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్స్ అందించిన పూరీ పేరును ఆయన మర్చిపోయాడంటూ ఒకటే కామెంట్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మహేష్ కూడా ఇది గమనించి.. వెంటనే తన పొరపాటును సవరించుకున్నారు. ‘వేడుకలో ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయా. నా 25 సినిమాల ప్రయాణంలో ‘పోకిరి’ నన్ను సూపర్స్టార్ను చేసింది. నాకు ‘పోకిరి’లో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పూరీ జగన్నాథ్గారు. ఈ సినిమాను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను’ అని ట్వీట్ చేశారు. ఇక ఇందుకు పూరీ సమాధానంగా.. ‘ధన్యవాదాలు సర్. లవ్యూ. ‘మహర్షి’ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నారు.
కాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. మహేష్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘మహర్షి’ మే9 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
[subscribe]
[youtube_video videoid=ByjXIbg4hjw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: