ఒకే రోజున ఇద్దరు యువ కథానాయకులు తమ తమ కొత్త సినిమాలతో సందడి చేయడానికి సిధ్ధపడుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఆ రెండు చిత్రాలు కూడా రీమేక్ మూవీస్ కావడం విశేషం. ఆ ఇద్దరు యువ కథానాయకులు… నిఖిల్, అల్లు శిరీష్ కాగా… ఆ సినిమాలు అర్జున్ సురవరం
, ఏబీసీడీ
.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాస్త వివరాల్లోకి వెళితే… నిఖిల్ హీరోగా టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్ సురవరం’. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కనితన్’కి రీమేక్ వెర్షన్గా ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా… కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదాలు పడుతూ… ఎట్టకేలకు ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక అదే రోజున… మరో యువ కథానాయకుడు అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ
కూడా విడుదల కానుంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా… అదే పేరుతో తెరకెక్కిన మలయాళ చిత్రానికి రీమేక్ కావడం విశేషం.
అంతేకాదు… 2016లో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో నిఖిల్… ఇక అదే సంవత్సరంలో విడుదలైన ‘శ్రీరస్తు శుభమస్తు’తో శిరీష్ ఆఖరిసారిగా విజయాలను అందుకున్నారు. అంటే… ఇద్దరికీ హిట్స్ అవసరమైన నేపథ్యంలో… ఇలా పరభాషా చిత్రాల రీమేక్లతో పోటీకి దిగుతున్నారన్నమాట. మరి… ఒకే సంవత్సరంలో చివరిసారిగా సక్సెస్లను అందుకున్న ఈ ఇద్దరు టాలెంటెడ్ హీరోస్… ఇప్పుడు ఒకే రోజు విడుదల కానున్న చిత్రాలతో మరోసారి విజయకేతనం ఎగరవేస్తారేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=UXRY4dRMTcQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: