రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే ఈ తరం దర్శకుల్లో వంశీ పైడిపల్లి ఒకరు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మున్నా
(2007) చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన వంశీ… అనంతరం బృందావనం
, ఎవడు
, ఊపిరి
చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నాడు. ఇక… ఐదో చిత్రంగా తెరకెక్కిన మహర్షి
మే 9న విడుదలకు సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా సినిమాకి భారీ విరామమే తీసుకుంటూ వస్తున్నప్పటికీ… ఇప్పటివరకు అగ్ర కథానాయకులతోనే వంశీ సినిమాలు చేస్తుండడం విశేషం. తొలి చిత్రాన్ని ప్రభాస్తో తెరకెక్కించిన వంశీ… రెండో చిత్రం బృందావనం
ని యంగ్ టైగర్ యన్టీఆర్తోనూ.. మూడో సినిమా ఎవడు
ని మెగాపవర్ స్టార్ రామ్చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (అతిథి పాత్ర)తోనూ.. నాలుగో చిత్రం ఊపిరి
ని కింగ్ నాగార్జునతోనూ రూపొందించాడు. ఇక ఐదో చిత్రం మహర్షి
ని సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కించాడు. అంతేకాదు… మహేష్కిది 25వ చిత్రం కావడం విశేషం. తాజాగా ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన మహర్షి
… మహేష్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్
గా నిలుస్తుందని యూనిట్ నమ్మకంగా చెబుతోంది.
అన్నట్టు… ఇదే మే 2న 12 ఏళ్ళ క్రితం మున్నా
విడుదలైంది. అంటే… దర్శకుడిగా వంశీ పైడిపల్లి పుష్కరకాలం పూర్తిచేసుకుంటున్నాడన్నమాట. ఈ సందర్భంగా… తనకు దర్శకుడిగా జన్మనిచ్చిన నిర్మాత (దిల్
రాజు) కాంబినేషన్లో… తొలి చిత్రం విడుదలైన అదే మే నెలలో వస్తున్న మహర్షి
తో… వంశీ కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకోవాలని ఆకాంక్షిద్దాం.
[subscribe]
[youtube_video videoid=PRms6fc7DN0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: