ప్రపంచ వ్యాప్తంగా రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మాత్రం ఏపీలో రిలీజ్ కు నోచుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఏపీలో ఎన్నికల ముందే సినిమా రిలీజ్ చేయాలని చూసినా.. ఎన్నికల తరువాతే రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. ఇక ఈరోజు ఏపీలో సినిమా రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు. కానీ ఈరోజు కూడా రిలీజ్ కు నోచుకోలేదు ఈ సినిమా. ఈరోజు ఎలాగైనా సరే ఈసినిమాను ఏపీలో రిలీజ్ చేయాలని వర్మ ఎంతో పట్టుదల చూపించినా, అధికారులు ససేమిరా అంటున్నారు. శాంతిభద్రతల సమస్య వస్తుందని ఏపీలోని థియేటర్ల నుంచి సినిమా తొలగించినట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో ఆగ్రహంతో ఉన్న వర్మ ఈ విషయంపై మరోసారి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. “సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది, హైకోర్టు కూడా సరేనంది. అలాంటప్పుడు ఏం శాంతిభద్రతల సమస్యలు వస్తాయనుకుంటున్నారో నా సినిమా విడుదలను అడ్డుకుంటున్న శక్తులను అడగాలనుకుంటున్నా!” అని ట్వీట్ లో పేర్కొన్నారు. మరి చూడబోతే ఎన్నికల ఫలితాల తరువాతే ఈసినిమా రిలీజ్ కు అనుమతులు దొరికేలా ఉన్నాయి. మరి చూద్దాం అప్పుడైనా రిలీజ్ అవుతుందో లేదో..?
[subscribe]
[youtube_video videoid=NO1vrmNBqz4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: