సూపర్ స్టార్ రజినీకాంత్కి అచ్చొచ్చిన దర్శకులలో ఏస్ ఫిల్మ్ మేకర్ శంకర్ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన `శివాజీ` (2007), `రోబో` (2010), `2.0` (2018) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అలాంటి… ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రాబోతోందని కోలీవుడ్ టాక్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్కు సంబంధించి రజినీ, శంకర్ మధ్య సంప్రదింపులు జరిగాయని… త్వరలోనే ఈ కాంబో మూవీపై క్లారిట్ వస్తుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం లోక నాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్లో `భారతీయుడు 2` చిత్రాన్ని రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు శంకర్. ఇక రజినీకాంత్ విషయానికి వస్తే… బ్రిలియంట్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ చేయబోతున్నారు. కాబట్టి… ఆ యా చిత్రాలు పూర్తయ్యాకే రజినీ, శంకర్ కాంబినేషన్ మూవీ పట్టాలెక్కే అవకాశముంది. మరి… సినిమా సినిమాకి మధ్య బాగానే గ్యాప్ తీసుకున్న రజినీ, శంకర్… నాలుగో సారి తక్కువ గ్యాప్లోనే రానున్న వైనం మరింతగా కలిసొస్తుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: