కేవలం కమర్షియల్ సినిమాలే రాజ్యమేలుతున్న వేళ ఆ ఒరవడిని పక్కన పెట్టి కేవలం సంగీతం.. సాహిత్యం.. నృత్యం అనే మూడు అంశాలను కీలకం చేసుకొని సినిమాలు తీసి వహ్ వా అనిపించుకున్న దర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాథ్. ఎన్నో మరుపురాని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన లెజండరీ డైరెక్టర్ బయోపిక్ ను ఈ తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ రచయిత జనార్థన్ మహర్షి దర్శకత్వంలో కె. విశ్వనాథ్ గారి బయోపిక్ ను తెరకెక్కిస్తుండగా… మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు కె. విశ్వనాథ్ జన్మదినం సందర్భంగా ఆయన బయోపిక్ ‘విశ్వదర్శనం’ టీజర్ను ఫిలింనగర్లోని కె.విశ్వనాథ్ నివాసంలో విడుదల చేశారు.
‘వందేళ్ల వెండితెర చెబుతున్న తొంబై ఏళ్ల బంగారు దర్శకుడి కథ’ అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ప్రముఖ గాయని సుశీల, నటి రాధికా శరత్ కుమార్, భానుప్రియ, ఆమని, సింగర్ శైలజ, విజయేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి ఇలా ఒక్కొక్కరూ విశ్వనాథ్ గారి గొప్పతనం గురించి చెబుతుంటారు. మధ్య మధ్యలో విశ్వనాథ్ కి సంబంధించిన అలనాటి ఫోటోలను టీజర్ లో చూపిస్తూ ఉన్నారు. చివరిగా.. ”నేను సినిమా అనే ఓ బస్సుని పట్టుకొని, సినిమా చూసే ప్రేక్షకులను భక్తులు అనుకుని నేను బస్సు నడిపే డ్రైవర్ ని.. ఏం చేయాలి నేను..?’ అంటూ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
[youtube_video videoid=8aGq36Cf1qg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: