క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు సంగతేమో కానీ..వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకోసం మాత్రం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూసున్నారు. ఫస్ట్ లుక్ నుండి మొదలుకొని ఇప్పటి వరకూ తన స్టైల్ లో స్ట్రాటజీలో వెళ్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ పై రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్నాడు వర్మ. ప్రమోషన్స్ లో కూడా కాస్త వెరైటీగా ప్రమోషన్స్ చేస్తూ హైప్ ను క్రియేట్ చేస్తున్నాడు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ పై మొదటి నుండి టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టీడీపీ నేతలు వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. వర్మ మాత్రం అవేమీ పట్టించుకోకుండా రోజుకో ట్విస్ట్ ఇస్తూనే ఉన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా నేపథ్యంలో తాజాగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న వర్మ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. రీసెంట్గా ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ..తాను బాలయ్య హీరోగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వివరించాడు.
ఒకవేళ గాంధీజీ బయోపిక్ తీస్తే.. బ్రిటిష్ వాళ్లతో పోరాడిన సన్నివేశాలు లేకుండా తీస్తే ఏముంటది.. బ్రిటిష్ వాళ్లు సౌత్ ఆఫ్రికాలో ట్రైయిన్ లోంచి గెంటేసిన సంఘటన మొదలుకొని స్వాతంత్య్ర పోరాటం కోసం బ్రిటిష్ వారితో పోరాడిన ఘట్టాన్ని తీసుకోవాలి. ఆయన జీవితంలో సినిమాటిక్ డ్రామా మొత్తం ఆ పీరియడ్లోనే ఉంది. ఆ విషయాలు కాకుండా ఆయన ఎక్కడ పుట్టాడు..ఎలా పెరిగాడనేది చూపిస్తే ఎవరు చూస్తారు? అలాగే ఎన్టీఆర్ జీవితం కూడా.. రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాతే అసలు డ్రామా మొదలవుతుంది… ఆయన సినీ పరిశ్రమలోకి రావడం.. స్టార్ గా ఎదగడం ఇవన్నీ కాస్త ఈజీగానే జరిగిపోయాయి..కానీ ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడం.. అది కూడా లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలో ఎంట్రీ ఇవ్వడం ఇంకా కీలకం. అవన్నీ ఒదిలేసి సినిమాల్లో ఎలా రాణించాడనేది అంత ఆసక్తిగా ఉండదని వర్మ అభిప్రాయ పడ్డాడు. అందుకే బాలయ్య తెరకెక్కించే ‘ఎన్టీఆర్’ బయోపిక్ నుంచి పక్కకు తప్పుకున్నట్టు వివరించాడు.
మొత్తానికి వర్మ బాలయ్య సినిమాలో చూపించలేకపోయినా..ఏకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే తీసి తను అనుకున్నది తీశాడు. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=xtnmRZ9_bzg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: