గత ఏడాది రంగస్థలం సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఇప్పటి వరకూ ఏ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. మరోపక్క రంగస్థలం సక్సెస్ తో సుకుమార్ తరువాత సినిమాపై అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఆసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం వల్ల.. తరువాత సినిమాపై ఇప్పటినుండే ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సుకుమార్ కూడా అందుకే భయపడ్డాడేమో కానీ..ఇప్పటి వరకూ ఏ కథకు శ్రీకారం చుట్టలేదు. అయితే ఈ ఏడాది మాత్రం సుకుమార్ పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడపబోతున్నట్టు తెలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రాజెక్టులతో ఈ ఏడాది మొత్తం బిజీ అవుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంక్రాంతి పండుగ సందర్బంగా సుకుమార్ తన కుటుంబసభ్యులతో సొంత ఊరు మాలికిపురానికి వెళ్లి అక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ లోకల్ మీడియాతో కాసేపు ముచ్చటించిన సుకుమార్ తన ఫ్యూచర్ ప్రాజెక్స్ట్ గురించి చెప్పుకొచ్చారు. ఈ ఏడాది పలు ప్రాజెక్టులతో వస్తున్నట్టు తెలిపారు.
వీటిలో ముందుగా సుకుమార్, మహేష్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతుంది. ఇవి కాకుండా..తను నిర్మాతగా మారి కొన్ని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో మొదటగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చి బాబు డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్ కూడా సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. అలాగే కాశి రెడ్డిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ నాగ శౌర్య తో సినిమాని నిర్మించనున్నారు. సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్, గీత ఆర్స్ట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఆ తరువాత నితిన్ హీరోగా కుమార్ 21f దర్శకుడు ప్రతాప్ డైరెక్షన్ లో సుకుమార్ మరో కొత్త సినిమాను నిర్మించనున్నాడు.
మొత్తానికి ఇంత గ్యాప్ ఇచ్చిన సుకుమార్ ఈ ఏడాది మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాడు. మరి ఈ సినిమాలన్నీ ఈ ఏడాదే రిలీజ్ కు నోటుకుంటాయా..లేక వచ్చే ఏడాది అవుతాయా చూద్దాం.. ఏం జరుగుతుందో?
[youtube_video videoid=ISSJx9e4em0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: