`చమ్మక్ చల్లో` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన కేరళకుట్టి కేథరిన్ త్రెసా. ఆ తరువాత `ఇద్దరమ్మాయిలతో`, `పైసా`, `ఎర్రబస్సు`, `రుద్రమదేవి` సినిమాల్లో సందడి చేసినా… అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన `సరైనోడు` చిత్రంతోనే బ్రేక్ అందుకుంది కేథరిన్. ఇందులో ఎం.ఎల్.ఎ క్యారెక్టర్లో తన యాక్టింగ్తో, గ్లామర్తో మెప్పించింది. ఆ తరువాత `గౌతమ్ నంద`, `జయజానకి నాయక` (స్పెషల్ సాంగ్), `నేనే రాజు నేనే మంత్రి`లో తన గ్లామర్తో అలరించింది. `నేనే రాజు నేనే మంత్రి` తరువాత మరో తెలుగు సినిమాకి సంతకం చేయని కేథరిన్.. తమిళ్, మలయాళ చిత్రాలతో బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం… ఈ ముద్దుగుమ్మ ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… విజయ్ దేవరకొండ హీరోగా `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` ఫేమ్ క్రాంతి మాధవ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్లో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ప్రారంభోత్సవం నాడు చిత్ర కథానాయికలుగా రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లెయిటి నటిస్తున్నట్లు ప్రకటించారు. ఆ కార్యక్రమానికి ఈ ముగ్గురూ కూడా హాజరయ్యారు. ఏమైందో ఏమో గానీ… ఇప్పుడు ఓ హీరోయిన్ పాత్రకి కేథరిన్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కేథరిన్ కనిపించనుందని సమాచారం. ఏదేమైనా… విజయ్ దేవరకొండ లాంటి యూత్ ఐకాన్ నటిస్తున్న సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న కేథరిన్… ఈ సారైనా టాలీవుడ్లో దూసుకుపోతుందేమో చూడాలి. త్వరలోనే కేథరిన్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
[youtube_video videoid=1ZLTAIfJzvc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: