అడివిశేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ టిక్క దర్శకత్వంలో వచ్చిన సినిమా మేజర్. ముంబై బాంబు దాడుల్లో అమర వీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. దేశవ్యాప్తంగా ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుందో చూశాం కదా. శేష్ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. సందీప్ పాత్రలో అడివి శేష్ పెర్ఫార్మన్స్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచాయి. అందులోనూ పేట్రియాటిక్ మూవీగా రూపొందించిన సినిమా కాబట్టి అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా గత ఏడాది జూన్ 3వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజుల తరువాత కూడా ఈసినిమా ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పుడు ఈసినిమాను మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవిద్ కూడా వీక్షించారు. ఈనేపథ్యంలో తాజాాగా అడివి శేష్ ను సైతం పిలిపించి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి సినిమాను తీసినందుకు గాను అడివి శేష్ ను చిత్రయూనిట్ ను ప్రశంసించారు.
కాగా ఈ సినిమాను జీఎంబీ ఎంటర్టైనమెంట్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏప్లస్ఎయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అడివిశేష్కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఇంకా ఈసినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, శోభితా ధూళిపాళ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: