సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.“సర్కారు వారి పాట” చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా “కళావతి” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా “సర్కారు వారి పాట “సెకండ్ సింగిల్ పక్కా మాస్ గా ఉండి ప్రేక్షకులను అలరించనుందని థమన్ ఎస్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. “సర్కారు వారి పాట “ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది. దర్శకుడు పరశురామ్ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. తరువాత మహేష్ బాబు, కీర్తి సురేష్ లపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడం తో “సర్కారు వారి పాట “ మూవీ షూటింగ్ కంప్లీట్ కానుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: