ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ‘కె.జి.యఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా.. మధ్యలో ఆది పురుష్ సినిమా ఉంది కాబట్టి ఈసినిమా షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మళ్లీ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఆసినిమా రెండ్ పార్ట్ లుగా రిలీజ్ చేయనున్నారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయంపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అయితే తాజాగా రాధేశ్యామ్ ప్రమోషన్ లో పాల్గొన్న ప్రభాస్ ను ఈ విషయంపై ప్రశ్నించగా ప్రభాస్ ఎలాంటి సమాధానం చెప్పకపోయినా.. ఆయన ఎక్స్ ప్రెషన్స్ బట్టి ఈ సినిమా రెండు పార్ట్ లుగా వచ్చే అవకాశం ఉందని అర్థమైపోయింది. సలార్ సినిమా రెండు భాగాలా లేక ఒక భాగమేనా? అని అడుగగా.. ఆయన చిరునవ్వుతో అవన్నీ తరువాత. ముందు రాధేశ్యామ్ అంటూ ప్రశ్నను వదిలేశారు. మరి త్వరలో దీనిపై మేకర్సే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్ కు విలన్గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.




[subscribe]
View this post on Instagram
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























