డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా వస్తున్న సినిమా లైగర్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తికావాల్సి ఉంది కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పటికే ముంబయి, హైద్రాబాద్లో ఈ మూవీ షూటింగ్ చేశారు. ప్రస్తుతం గోవాలో షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈషూటింగ్ తరువాత మరికొద్ది రోజులు విదేశాల్లో షూట్ చేసి షూటింగ్ ను పూర్తిచేసుకోనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో లెజెండరీ బాక్సర్ ‘మైక్ టైసన్’ కూడా అతిథి పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమాలో మైక్ టైసన్ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమాల్లో నటించని ప్రపంచ మాజీ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తొలిసారి ఓ పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతోన్న తెలుగు సినిమాలో నటించబోతున్నాడు. దీంతో ఇప్పటికే ఈసినిమాపై భారీ అంచనాలు ఉండగా ఇప్పుడు ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయి.
For the 1st time Ever🤟
Introducing the Master of the RING to the INDIAN SCREENS
DYNAMITE @MikeTyson on Board for #Liger🥊#NamasteTYSON#HbdPuriJagannadh@TheDeverakonda @karanjohar #Purijagannadh @ananyapandayy @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies @PuriConnects pic.twitter.com/ufB1BEq4YL— Puri Connects (@PuriConnects) September 27, 2021
కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























