ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ ఎవరంటే అందులో ముందుగా రష్మిక మందన పేరు కూడా వినిపిస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఈ భామ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ భామ అందులో కూడా టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 20 మిలియన్స్ మంది ఈ భామను ఫాలో అవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రష్మిక షేర్ చేస్తూ.. ‘20 మిలియన్ల ప్రేమను ఫీల్ అవుతున్నా.. లవ్ యూ’ అనే క్యాప్షన్తో పోస్టు షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన మిగతా హీరోహీరోయిన్లు కూడా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్పలో చేస్తోంది ఈ చిన్నది. ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుంది. ఈసినిమాతో పాటు శర్వానంద్ హీరోగా వస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో నటిస్తుంది. వీటితో పాటు హిందీలో ‘మిషన్ మజ్ను’ అనే చిత్రంతో పాటు గుడ్ బై అనే సినిమాలో నటిస్తుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























