రాహుల్ సంకీర్త్యన్తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవలే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడం చూశాం. ఇక గత కొద్దికాలంగా కోల్ కత్తాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా అక్కడ షూట్ ను పూర్తిచేసుకుంది. ఇక ఇప్పుడు చిత్రయూనిట్ మొత్తం గోదావరి తీరంలో షూటింగ్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాళ్లపూడిలోని గోదావరి తీరంలో చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. హీరో నాని, హీరోయిన్ సాయిపల్లవి ఇతర నటులు రేవు వద్ద నుంచి పడవ దాటే సన్నివేశంతో పాటు పలు సన్నివేశాలను చిత్రీకరించనుంది చిత్రయూనిట్.


కృతిశెట్టి, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా కీలక పాత్రలో నటించనున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ ఎస్. బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. సను జాన్ వర్ఘీస్ సినిమాటోగ్రాఫర్గా, నవీన్ నూలి ఎడిటర్గా పని చేస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























