మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “పుష్ప “మూవీ ఆగస్ట్ 13 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకూ “పుష్ప “మూవీ షూటింగ్ మారేడుమిల్లి , తమిళనాడు అటవీ ప్రాంతాలలో జరిగింది. “పుష్ప “మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో హీరో అల్లు అర్జున్ , హీరోయిన్ రష్మిక , ఇతర నటీనటులపై పలు సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. నెలాఖరు వరకూ ఈ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. తరువాత షూటింగ్ షెడ్యూల్ కేరళ రాష్ట్రంలో జరపాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో ..” మూవీ తరువాత అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: