బ్లాక్ బస్టర్ “మద్రాస్ కేఫ్ ” (2013) మూవీ తో బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రాశీఖన్నా సూపర్ హిట్ “ఇమైక్క నోడిగళ్ ” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యి పలు సూపర్ హిట్ మూవీస్ తో కోలీవుడ్ లో బిజీగా మారారు. రాశీఖన్నా ప్రస్తుతం 2 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ కు రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మద్రాస్ కేఫ్ ” మూవీ తరువాత రాశీఖన్నా హిందీ మూవీస్ లో నటించలేదు. రాశీఖన్నా మాట్లాడుతూ .. బాలీవుడ్ లో నటించకపోవడానికి ప్రత్యేక కారణాలు లేవనీ , “మద్రాస్ కేఫ్ ” మూవీ లో నటిస్తున్న టైమ్ లోనే టాలీవుడ్ లో “మనం ” మూవీ లో అవకాశం వచ్చిందనీ , హీరోయిన్ గా నటించిన “ఊహలు గుస గుస లాడే ” మూవీ ఘనవిజయం సాధించిందనీ , తరువాత వరుస మూవీస్ తో బిజీగా మారాననీ, తెలుగు ప్రేక్షకులనుండి అపారమైన ప్రేమ , అభిమానం లభిస్తున్నాయనీ, కుటుంబం తో హైదరాబాద్ లో సెటిల్ అయ్యాననీ , ప్రత్యేకంగా హిందీ మూవీస్ కై ఆలోచించడం దేనికని అనిపిస్తుందనీ , అవకాశాలను బట్టి తమిళ , మలయాళ మూవీస్ లో నటిస్తాననీ , బాలీవుడ్ కు వెళ్ళే ఆలోచన లేదనీ , నటిగా తన ప్రయాణం సంతృప్తికరంగా సాగుతుందనీ రాశీఖన్నా చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: