టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో కథానాయిక గా నటిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులను అలరిస్తున్నారు. వర్కౌట్స్ , ఫుడ్ , బ్యూటీ టిప్స్ , స్టూడెంట్స్ కు సలహాలు ఇస్తూ రష్మిక అభిమానులను ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇప్పుడు రష్మిక పర్యావరణ పరిరక్షణకై అభిమానులకు సందేశం ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ రష్మిక తన లేటెస్ట్ ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి, తాను పచ్చదనాన్ని , ప్రకృతిని ప్రేమిస్తానని అందరికీ తెలిసిన విషయమే ననీ , పర్యావరణాని కై కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాననీ , ఇప్పుడు తాను ధరించిన డ్రెస్ రీ సైకిల్డ్ అనీ , తనకు చాలా నచ్చిందనీ , పర్యావరణానికై మంచిపని చేశాననీ , మనమంతా రీ సైకిల్ , రీ యూజ్ , రెడ్యూస్ వంటి ప్రయత్నాలు చేసి పర్యావరణ పరిరక్షణ చేద్దామనీ రష్మిక అభిమానులకు సందేశం ఇచ్చారు. దాదాపు 5నెలలపాటు కూర్గ్ లోని తన స్వంత ఇంటిలో కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేసిన రష్మిక హైదరాబాద్ కు చేరుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: