టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ “పెంగ్విన్ “, మిస్ ఇండియా”, “గుడ్ లక్ సఖి” వంటి మూవీస్ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రంగ్ దే !” మూవీ లో నటిస్తున్నారు. ఇప్పుడు నితిన్ హీరోగా రూపొందనున్న మరో మూవీ కి కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రేష్ఠ్ మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “పవర్ పేట్” మూవీ రెండు భాగాలుగా రూపొందనుంది. ఈ మూవీకి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. హీరో నితిన్ ప్రస్తుతం “రంగ్ దే, చంద్ర శేఖర్ యేలేటి మూవీ, బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధన్ ” మూవీ తెలుగు రీమేక్ లలో బిజీగా ఉన్నారు. ఈ మూడు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తరువాత “పవర్ పేట్” మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. సూపర్ హిట్ “భీష్మ” మూవీ తరువాత నితిన్ నటించిన “రంగ్ దే !” మూవీరిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: