పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకుడిగా మలయాళంలో గత ఏడాది మార్చిలో వచ్చిన ‘లూసిఫర్’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రైట్స్ రామ్ చరణ్ సొంతం చేసుకొని.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరు ప్రధాన పాత్రలో చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే హక్కులు సొంతం చేసుకున్నాడు కానీ అప్పటినుండీ.. ఈ సినిమా డైరెక్టర్, హీరో విషయంలో మాత్రం చరణ్ ఓ నిర్ణయానికి రాలేకపోయాడు. ఇక ఇన్ని రోజులు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా మరోసారి ఈ వార్త తెరపైకి వచ్చింది. చిరంజీవి కథానాయకుడిగా చరణ్ ఈ సినిమాను నిర్మించడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడట. అంతేకాదు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను వి.వి. వినాయక్ కి అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో చిరంజీవి వున్నాడట. గతంలో చిరంజీవితో వినాయక్ చేసిన ‘ఠాగూర్’ ..’ఖైదీ నెంబర్ 150′ సినిమాలు భారీ విజయాలను దక్కించుకున్నాయి. ఈ రెండు సినిమాలు రీమేక్ లే. అందుకే చిరంజీవి .. వినాయక్ వైపు మొగ్గుచూపుతున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలుసుకోవాలనుకుంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.



కాగా ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. మరి ఈ సినిమా అయిపోయిన తర్వాత చిరు ఆ సినిమాను మొదలుపెడతాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























