ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటించబోతుండగా..అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నసంగతి తెలిసిందే. ఇటీవలే అరవింద్ స్వామి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ రోల్ అంటే శోభన్ బాబుది అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ పాత్రలో నటిస్తున్నట్టు విజయ్ దేవరకొండ తో పాటు పలువురి పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ పాత్రలో ఎవరు నటిస్తున్నారో క్లారిటీ వచ్చేసింది. శోభన్ బాబు పాత్ర కోసం బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జిషు సేన్ గుప్తా తాజాగా తెలుగులో విడుదలైన ‘అశ్వద్ధామ’లో విలన్గా అదరగొట్టాడు. ఇప్పుడు తలైవి లో శోభన్ బాబు పాత్రకు తను అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని ఎంపిక చేశారట.
[custom_ad]
ఇంకా ఈ సినిమాలో జగపతి బాబు, జయసుధ, సత్యరాజ్ ముఖ్య పాత్రలలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్తో కలిసి విబ్రీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. జూన్ 26న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: