`మహానటి`(2018)తో సెన్సేషనల్ హిట్ అందుకోవడమే కాకుండా… `ఉత్తమ నటి`గా జాతీయ స్థాయిలో పురస్కారాన్ని కూడా అందుకుంది కేరళకుట్టి కీర్తి సురేష్. ఆ బయోపిక్ తరువాత కీర్తి.. మళ్ళీ తెలుగులో (నేరుగా) కథానాయికగా నటించిన చిత్రం `మిస్ ఇండియా`. కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ద్వారా నరేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కాగా, చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మార్చి 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి.. `మహానటి`గా మురిపించిన కీర్తి సురేష్… `మిస్ ఇండియా`గానూ మెస్మరైజ్ చేస్తుందేమో చూడాలి. కాగా, ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్నాడు.
[custom_ad]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: