`సింహా`, `లెజెండ్` తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో మాస్ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రథమార్ధంలో పూజా కార్యక్రమాలు జరిపి… నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించిన సింహభాగం చిత్రీకరణ యు.ఎస్. నేపథ్యంలో సాగుతుందట. అందుకే… నెల రోజుల పాటు అక్కడ షూటింగ్ జరిపి, ఆపై ఇండియాలో మిగిలిన పోర్షన్ ని కంప్లీట్ చేసే దిశగా ప్లానింగ్ జరుగుతోందట. అలాగే, ముందుగా అనుకున్నట్లే… 2020 వేసవి చివరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.
కాగా, బాలయ్య 105వ చిత్రం `రూలర్` ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: