యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ పిరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి `జిల్` రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ… ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… పునర్జన్మల నేపథ్యంలో ఈ ప్రేమకథా చిత్రం సాగుతుంది. గత జన్మలో జరిగే కథ ఇటలీ బ్యాక్ డ్రాప్ లో ఉంటే, ఈ జన్మలో జరిగే కథ ఇండియాలో సాగుతుందట. ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ కూడా రెండు జన్మల్లోనూ ప్రేమికులుగానే కనిపిస్తారని టాక్. మరి… ఈ కథనాల్లో నిజమెంతో తెలియాలంటే విడుదల తేది వరకు వేచి చూడాల్సిందే.
అమిత్ త్రివేది బాణీలు అందిస్తున్న ఈ చిత్రం… 2020 ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: