ఇటీవలే డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో విజయ్ సింగరేణి ఉద్యోగిగా కనిపించనున్నాడని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా హీరో అనే సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. దానితోపాటు పూరితో కూడా సినిమా చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించాడు. ఇక తాజా సమాచారం ప్రకారం జనవరిలో ఈ సినిమా షూటింగ్ ను మొదలపెట్టనున్నట్టు తెలుస్తుంది. క్రాంతి మాధవ్ సినిమా అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నాడట విజయ్. అంతే కాదు ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ గా కనిపించనున్నాడట. పూరీ ఎలాగూ మూడు నెలల్లో సినిమా అయిపోగొడతాడు కాబట్టి సమ్మర్ లో రిలీజ్ చేయొచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























