స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ మెరుపు వేగంతో సాగుతోంది.
ఇదిలా ఉంటే… అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని సమాచారం. అంతేకాదు… బలరామ కృష్ణుల కథను ఆధునికంగా అల్లుకుని త్రివిక్రమ్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడని టాక్. ఈ నేపథ్యంలోనే… పోతన భాగవతంలో బాగా ప్రాచుర్యం పొందిన “గజేంద్రమోక్షం” పద్యంలో వచ్చే ‘అలా… వైకుంఠపురంలో’ అనే పదాలనే ఈ సినిమా టైటిల్గా ఆల్మోస్ట్ ఫైనల్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా… ఆగస్టు 15న బన్నీ-త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ టైటిల్పై అధికారికంగా ప్రకటన వస్తుంది కాబట్టి… అప్పటివరకు వేచి చూడాల్సిందే.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=OhmS9NbPO-Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.