`చిత్రలహరి`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చేసిన మెగా హీరో సాయితేజ్… ప్రస్తుతం `ప్రతీరోజు పండగే`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్పై ఉండగానే… మరో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్కి తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. వాటిలో ఒక చిత్రాన్ని `వెంకటాద్రి ఎక్స్ప్రెస్`, `ఎక్స్ప్రెస్ రాజా` చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించనుండగా… మరో సినిమాని సుబ్బు అనే నూతన దర్శకుడు రూపొందించనున్నాడని తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మేర్లపాక గాంధీ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుండగా… సుబ్బు కాంబినేషన్ మూవీని బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ప్రొడ్యూస్ చేయనున్నాడని వినిపిస్తోంది. అంతేకాదు… మేర్లపాక గాంధీ చిత్రం ఏడాది చివరలో పట్టాలెక్కనుండగా… సుబ్బు కాంబినేషన్ మూవీ వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళనుందని అంటున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాలకి సంబంధించిన అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశముంది.
[subscribe]
[youtube_video videoid=gIQHYdck5Dk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: